ప్రతి జనసైనికుడికి పార్టీ అండగా ఉంటుంది

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె: జనసేన పార్టీ ప్రతి జనసైనికుడి కుటుంబానికి అండగా ఉంటుందని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా వున్న బి.ఈశ్వరయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ‌క్రియాశీలక సభ్యుడిగా ఉన్న ఈశ్వరయ్య కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. ‌ఈశ్వరయ్య సతీమణి రెడ్డెమ్మకు పార్టీ నుండి రూ.50 వేల రూపాయల చెక్ పార్టీ కార్యాలయం నుండి పంపించారు. ‌బుధవారం జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆద్వర్యంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి చేతుల మీదుగా రెడ్డెమ్మకు అందించారు. ‌ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, నారాయణ స్వామి, పవన్ శంకర, రెడ్డి శేఖర్ రెడ్డి, గంగులప్ప, నరసింహ, సుధాకర్, హరి, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.