ఐర్లాండ్ లో శ్రీ నాగబాబుకు ఘనస్వాగతం

* జన సైనికులు, వీరమహిళలతో ఆత్మీయ సమావేశం
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు యూరోప్ పర్యటనలో భాగంగా ఐర్లాండ్ చేరుకున్నారు. డంబ్లిన్ విమానాశ్రయంలో శ్రీ నాగబాబు గారికి ఎన్ ఆర్ ఐ జనసేన ఐర్లాండ్ విభాగం సభ్యులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఐర్లాండ్ లోని ఎన్ ఆర్ ఐ జనసైనికులు, వీర మహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యక్రమాలు, పార్టీ ఉన్నతికి అందించాల్సిన సేవలపై వారితో చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క ఎన్నారై జన సైనికుడు, వీర మహిళ కృషి వెల కట్టలేనిదన్నారు. యూరోప్ పర్యటనలో భాగంగా మూడు రోజుల క్రితం లండన్ లో పర్యటించిన శ్రీ నాగబాబు గారు యూకేలో మూడు రోజులపాటు పార్టీ మద్దతుదారులు, ఎన్ఆర్ఐ విభాగం సభ్యులతో మమేకమయ్యారు. ఈ నెలాఖరు వరకు సాగనున్న యూరోప్ పర్యటనలో ఐర్లాండ్ తో పాటు నెదర్లాండ్స్, జర్మనీ తదితర దేశాల్లో పర్యటిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆస్ర్టేలియా కన్వీనర్ శ్రీ శశిధర్ కొలికొండ పాల్గొన్నారు.