హైదరాబాద్ నగరానికి కేటీఆర్ ఏం చేశారో చెప్పాలి: రఘునందన్

గ్రేటర్ ఎన్నికల సాక్షిగా టీఆర్ఎస్  నేతలపై బీజేపీ  విమర్శలు ఎక్కుపెడుతోంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు..మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేశారు. కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్న మంత్రి కేటీఆర్..హైదరాబాద్ నగరానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్ని హిందూ-ముస్లింల మధ్య పోటీగా చూప వద్దని కోరారు. చింతమడకకు కేసీఆర్ ఇచ్చింది కేవలం 1.5 లక్షలేనని..కేంద్రం 8 లక్షలిచ్చిందని గుర్తు చేశారు. అదే విధంగా భాగ్యనగరంలో 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ముంజూరు చేసిందన్నారు. దేవాలయాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్, కేటీఆర్ లకు లేదని ఎమ్మెల్యే రఘునందర్ రావు స్పష్టం చేశారు.

నగరంలో తమకు నచ్చిన ఆలయానికి వెళ్తామని..గుడికి వెళ్లాలంటే కేసీఆర్ లేదా ఒవైసీ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. హిందుగాళ్లు బొందుగాళ్లు అన్నందుకు కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్ కు సరైన రీతిలో సమాధానం చెప్పారన్నారు. టీఆర్ఎస్ అధికారంలో వచ్చాకే..హైదరాబాద్‌లో అరాచకాలు పెరిగిపోయాయన్నారు.