బొబ్బిలిలో గ్రంథాలయం ఎప్పుడు నిర్మిస్తారు ఎమ్మెల్యే శంబంగి గారు??

  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: చదువులకు నిలయంగా ఉన్న బొబ్బిలిలో శాశ్వత గ్రంథాలయం కూడా పూర్తి చెయ్యలేని పరిస్థితులో ఈ ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు ఉండటం బాధాకరం. శాశ్వత భవనం మీరు ఇపుడు ఎలాగూ నిర్మించలేరు. కనీసం ఇప్పుడున్న తాత్కాలిక భవనంలో టాయిలెట్ సదుపాయం, పాడైపోయిన బోరింగు పునరుద్ధరణ, చిల్లులు పడ్డ భవనం పైకప్పులను తీసి కొత్తవి వేసి, కనీసం పుస్తకాల స్టోరేజీకీ కొన్ని బీరువాలు అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం అవసరమైన పుస్తకాలు అందుబాటులోకి తక్షణమే తీసుకురండి అంటూ స్థానిక ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు గారికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు హితవు పలికారు. ఈ వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనియెడల జనసేన పార్టీ తరపున మేమే చందాలు వేసుకుని మరీ గ్రంథాలయం మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, తెర్లాం మండల అధ్యక్షులు మరడాన రవి, బలిజిపేట మండల అధ్యక్షులు బొంకురు పోల్ నాయుడు, జనసేన నాయకులు పళ్లెం రాజా, పైలా సాయిరాం, గేదెల శివ, జగన్ రామభద్రపురం మండల నాయకులు చీమల సతీష్, రమేష్, సీతానగరం మండల నాయకులు శివ శంకర్, జనసైనికులు పాల్గొన్నారు.