అర్హులైన వారికి పెన్షన్ ఎక్కడ? సొంతిల్లు ఎప్పటికో?: పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, గురజనాపల్లి గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి & పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి 13వ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరించారు. వృద్ధులు అని చూడకుండా, ఆధారం లేని మహిళలకు పెన్షన్లు ఇవ్వకుండా ఉన్న పెన్షన్లు కూడా తీసేసి ఇబ్బంది పెడుతున్నారు, పట్టాలు వచ్చాయి కానీ లబ్దీదారుడు ఇల్లు కట్టుకోవడానికి స్థలమే లేకుండా చేశారు.ఈ వైసిపి ప్రభుత్వం అంతం అయ్యేరోజు త్వరలోనే ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే జనసేన, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.