వరికూటి నాగరాజును మర్యాదపూర్వకంగా కలసిన జనసేన నాయకులు

కనిగిరి: జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గం లీడర్ గా (పాయింట్ ఆఫ్ కాంటాక్ట్) నియమితులైన వరికూటి నాగరాజును మర్యాదపూర్వకంగా జనసేన నాయకులు కలిసి నియోజకవర్గ సమస్యలు గురించి, రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాల గురించి జనసేన & టిడిపి సమన్వయం, బలోపేతం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, కనిగిరి నియోజకవర్గం సమన్వయకర్త రహీముల్లా, డేగల దొరస్వామి, కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్, పామూరు మండల అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు, వెలిగండ్ల మండల అధ్యక్షుడు తాతపూడి ప్రవీణ్ కుమార్, జనసేన నాయకులు గోస్ట్ సునీల్, రమేష్ బాబు, శీలం రవి, అక్బర్, కార్యకర్తలు పాల్గొన్నారు.