ఎవరికి న్యాయం చేసావు జగన్ రెడ్డి?: తోట ఓబులేసు

శింగనమల: జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ల మీద మహిళల మీద గౌరవం లేదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. దమ్ముంటే సొంత బాబాయి హత్య కేసు మీద పోరాడుతున్న చెల్లెలికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు ఈ ముఖ్యమంత్రి.
తన రాజకీయ స్వలాభం కోసం సొంత కుటుంబంలోని తల్లిని చెల్లిని రోడ్లపై తెచ్చి రాజకీయంగా వాడుకొని ఈరోజు తన సొంత తల్లిని చెల్లిని తన్ని తరిమేసింది నువ్వు కాదా?.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిరంగ సభలలో న్యాయబద్ధంగా విడిపోయిన మహిళల ప్రస్తావన తీసుకురావడం చాలా సిగ్గుచేటు. బహిరంగ సభలలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో తను రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పవలసింది పోయి ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటమే సరిపోయింది ఈ ముఖ్యమంత్రికి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
రాబోవు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ ఏకమై జగన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారని శింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు ఘాటుగా విమర్శించడం జరిగింది.