విరవ దుర్గామాత అమ్మవారి అన్నసంతర్పణ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా విరవ గ్రామం నందు కమిటీ వారి ఆహ్వానం మేరకు దసరా ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఏర్పాటు చేసినటువంటి దుర్గామాత అమ్మవారి అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం అమ్మవారికి 5116/- రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గేదెల సూర్యనారాయణ, మంచెల చిన్న, నరాలశెట్టి వెంకటేష్, నరాలశెట్టి మణేంద్ర, అడపా రమేష్, జ్యోతుల గంగాధర్, ఆచంట గోపి, దుగ్గన దత్త, తమ్మనబోను సుబ్రహ్మణ్యం, మరియు జనసైనికులు గ్రామపెద్దలు పాల్గొనడం జరిగింది.