ప్రజలకోసం ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్టులు చేయిస్తారా?

పేదప్రజలకు ఎన్నికలకు ముందు 200 యూనిట్లు ఉచితం అని మాట ఇచ్చి.. నాడు ఇచ్చిన మాట తప్పి నేడు కొత్తగా ఏపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిన కారణంగా.. జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా.. తాడిపత్రి నియోజక వర్గం నుంచి నియోజక ఇంఛార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి నుంచి జనసైనికులు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో ఇది ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని జనసెన పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ మెంబర్ చిలకం మధుసూదన రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జయరామ్ రెడ్డి, ఈశ్వర్ మరియు శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. అయితే పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకొని నాయకులను అరెస్టు చేయడం జరిగింది. ప్రజల పక్షాన పోరాడితే అరెస్టులు చేస్తారా అని జనసేన నాయకులు పోలీసులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జి సునీల్, జనసైనికులు నరసింహా చారి, గోపాల్, అజయ్, శివ, నరేష్, వెంకటేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-04-01-at-7.16.12-PM-1-1024x768.jpeg