శ్రీకాళహస్తి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి

  • జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా సోమవారం రేణిగుంట పట్టణం, అనాసంపల్లి రోడ్డు, పాంచాలి నగర్ 1,2,3,4 వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ సుధీర్ రెడ్డికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని, పార్లమెంట్ ఎంపీ స్థానానికి బీజేపీ వరప్రసాద్ కి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. గత 5 సం.|| నియోజకవర్గంలో ఉంటూ ప్రజల తరఫున పోరాడిన విధంగానే రానున్న రోజుల్లో అధికారంలో ఉంటూ జనసేన తరఫున అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.