బొబ్బిలి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బొబ్బిలి, మహిళా దినోత్సవ సందర్భంగా బొబ్బిలిలో మండల అధ్యక్షులు సంచాన గంగాధర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ వీర మహిళలను మరియు సమాజంలో పదిమందిని ప్రభావితం చేసే విధంగా వివిధ రంగాలలో రాణిస్తూ మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహిళామూర్తులను సన్మానించి నిండు నూరేళ్లు పసుపు కుంకుమతో వర్ధిల్లాలని పవన్ అన్న పుట్టింటి సారి పసుపు కుంకుమ గాజులు మరియు చిరు కానుకలు ఇచ్చి బహుకరించారు. ఈ కార్యక్రమంలో పారాది ఎంపీటీసీ అభ్యర్థి దివ్య యామిని, మహాలక్ష్మి, రమ్య మరియు వీర మహిళలు తెర్లాం మండల అధ్యక్షులు మరడాన రవి, ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు దాసు, మహంతి ధనంజయ, గార గౌరీశంకర్, అల్లు రమేష్, జనసేన నాయకులు రాజా, సత్య, సతీష్ చరణ్, ఆది, జనసైనికులు పాల్గొన్నారు.