జనసేన కార్యకర్తలకు వై శ్రీనివాస్ చేయూత

*జనసేన పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్

రాజమహేంద్రవరం నగరం 35 వార్డు కొర్లమ్మలపేటకు చెందిన పడాల శివాజీ 2019 ఎలక్షన్ లో పార్టీ కోసం కష్టపడి పనిచేసారు. తదనంతరం ఆరోగ్యం సహకరించని కారణంగా తిరగలేకపోతున్నానని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ కు తన ఆరోగ్య సమస్య వివరించి.. తనకు నెలకు మందుల నిమిత్తం చాలా ఖర్చు అవుతుంది అని విన్నవించుకున్నారు. శివాజీ కష్టానికి చలించిన వై శ్రీనివాస్ మందుల నిమిత్తం 10,000/- ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. ఏ అవసరం వచ్చినా శివాజీ ని అన్ని విధాల ఆదుకుంటాం అని వై శ్రీనివాస్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యాదర్శులు జామి సత్యనారాయణ, తేజోమూర్తుల నరసింహమూర్తి, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాధరావు, ప్రధాన కార్యదర్శి షేక్ భాషాలిమ్రా, కార్యాదర్శి కప్పల సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.