అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న యడ్లపల్లి

పెడన నియోజకవర్గం: శ్రీ మహా గణపతి నవరాత్రులలో భాగంగా బుధవారం బంటుమిల్లి మండలం, పెందుర్రు గ్రామంలోని చిటికినేని బజార్ వద్ద విఘ్నేశ్వర స్వామి వారి చలువ పందిరిలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పెందుర్రు తెలుగు యువత వారి ఆహ్వానం మేరకు పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెందుర్రు కొండ, గ్రామస్థులు మరియు బంటుమిల్లి మండలం జనసేన నాయకులు వెంట్రపాటి నాగబాబు, మారుబోయిన సుబ్బు, గోట్రు రవి కిరణ్, దివి శ్రీనివాస్, యడ్లపల్లి రుకేష్, పయ్యావుల నాగంజనేయులు, పోలగాని లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.