పుంగనూరు నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న యల్లటూరు

పుంగనూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిపగడాల రమణ ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు ముఖ్య అతిథిగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన టిడిపి పుంగునూరు అసెంబ్లీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి గారిని మరియు రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనందరి సమిష్టి కృషితో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని జనసేన పార్టీ బలంగా వున్న పుంగనూరు నియోజకవర్గం కావున ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకే అని జనసైనికులకు తెలిపారు. యల్లటూరు శ్రీనివాస రాజుని ఘనంగా సత్కరించిన జనసైనికులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామా శ్రీనివాస్, రాయలసీమ జోనల్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, పుంగనూరు మండల అధ్యక్షులు విరూపాక్ష, టౌన్ అధ్యక్షులు నరేష్ రాయల్, సోమల అధ్యక్షులు భూషణ్ రాయల్, సదుం అధ్యక్షులు నాగ తేజ, పులిచెర్ల అధ్యక్షులు దేప మోహన్, రొంపిచర్ల అధ్యక్షులు శేఖర్ , పుంగనూరు మండల ఉపాధ్యక్షులు సుబ్బు, ఐటీ ఇంచార్జీ దేశది వికాస్, మండల ప్రధాన కార్యదర్శి హరీ నాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.