రామచంద్ర యాదవ్ పై వైసీపీ దాడి పిరికిపంద చర్య: తోట లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి: ప్రముఖ పారిశ్రామికవేత్త, పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ చేసిన దాడి ఘటన అందరికీ విదితమే. ఈ ఘటనను అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ పై వైసీపీ కిరాయి మూకల దాడి పిరికిపంద చర్య అని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతుల కోసం సభ నిర్వహించాలనుకోవడం ఆయన చేసిన తప్పా..? సమస్యలపై మాట్లాడితే దాడులు చేస్తారా అన్నారు. బీసీ నాయకులపై దాడులు చేయడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఈ దాడి కేవలం రామచంద్ర యాదవ్ పై జరిగిన దాడి మాత్రమే కాదని వెనుకబడిన వర్గాలందరిపై జరిగిన దాడి అని, బీసీ కార్పొరేషన్ నిధులను ప్రక్కదారి పట్టిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బీసీలు అందరూ కలసి చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరు చేసే రౌడీ ప్రభుత్వాన్ని అణగ తొక్కే రోజులు కొద్ది రోజుల్లోనే ముగుస్తాయి.. మీరు.., మీ అధికారం బలం ఎటు పోతుందో ఖబర్దార్ రాసి పెట్టుకోండి అంటూ లక్ష్మీనారాయణ మండిపడ్డారు.