ముస్లింల దుల్హన్ పథకాన్ని గాలికి వదిలేసిన వైసిపి ప్రభుత్వం: బండారు శ్రీనివాస్

కొత్తపేట, వైసీపీ ప్రభుత్వ పనితీరుపై స్పందించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ
గత మూడు సంవత్సరాల క్రితం వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలో భాగంగా విశాఖపట్నంలో ముస్లిం సోదరులు సోదరీమణులు అందరితో కలిసి భారీగా మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ఇదే దుల్హన్ పథకం గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఇచ్చే దుల్హన్ పథకం 50,000 ఏదైతే ఉందో అదే పథకాన్ని వైఎస్సార్ దుల్హన్ పథకం పేరుతో లక్ష రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన పథకాలు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవని ఆయన అన్న లక్ష రూపాయలు కాదు కదా అప్పటివరకు ఉన్న 50,000 కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ముస్లింలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన జగన్ మోహన్ రెడ్డి వెంటనే మీరన్న పథకాలను తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.