కావలి జనసేనలో చేరిన యువత

కావలి రూరల్ మండలము, మార్కండేయపుర గ్రామ యువత సోమవారం కావలి నియోజకవర్గ కార్యాలయములో అళహరి సుధాకర్ ఆధ్వర్యములో సూరిపోగు రాజేష్, అగస్టిన్ చొరవతో, గుడిపల్లి వెంకయ్య అధ్యక్షతన పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ యువత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై యువత కోసం వారి భవిష్యత్తు కోసం పెట్టిన పార్టీ కావున వీరు పార్టీలో చేరడం జరిగింది. అదే క్రమములో మనము మన ఉమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించుకోవాలసిన భాధ్యత మన మీద ఉందని తెలిపారు.