త్వరలో ప్రారంభంకానున్న జనసేనాని కొండగట్టు యాత్ర

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన అనుష్టుప్ యాత్ర అతి త్వరలో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర ప్రసిద్ధ నరసింహ స్వామి వారి ఆలయాలను దర్శించుకుంటూ మార్చి 14న మంగళగిరిలోని నరసింహ స్వామి ఆలయం వద్ద ముగుస్తుంది. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మంగళగిరిలో జరుగుతుంది. మార్చి 14న ఈ సభ ను ఉద్దేశించి అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నాయకులకు, జనసైనికులకు దిశానిర్దేశం
చేయనున్నారు.