జనసేనలోకి వైసీపీ నేతలు

• రాజమండ్రిలో కండువా కప్పి ఆహ్వానించిన నాదెండ్ల మనోహర్ 
రాజమండ్రి రూరల్, అర్బన్, పిఠాపురం నియోజకవర్గాలకి చెందిన పలువురు వైసీపీ కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన అందరికీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ధవళేశ్వరం గ్రామానికి చెందిన కొంతమూరు మాజీ సర్పంచ్ దండమూడి మోహనరావు, పి.ఎ.సి.ఎస్. మాజీ అధ్యక్షులు చెరుకూరి రత్నాజీ, ధవళేశ్వరం మాజీ ఎంపీటీసీ మేకా సత్యనారాయణ, వైసీపీ ప్రచార కార్యదర్శి ఏజిఆర్ నాయుడులతోపాటు ఎం. అప్పారావు, ఈదర సత్యనారాయణ, పిల్లా దుర్గాప్రసాద్, పిల్లా మురళీ తదితరులు చేరారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్, దేసిలింగ భాస్కరరావు, శాఖ నాగేశ్వరరావు, గరగ సత్యానందం, బొంతు లచ్చారావు, కందా చక్రబాబు తదితరులు చేరారు. ఈ సందర్భంగా కొత్త సభ్యులకు మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేశ్, పార్టీ నేతలు అత్తి సత్యనారాయణ, వై.శ్రీనివాస్, శ్రీమతి మాకినీడు శేషుకుమారి, చెరుకూరి రామారావు, డా. పిల్లా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.