యువత అన్ని రంగాల్లో ముందుకు సాగాలి: డిఎంఆర్ శేఖర్

  • వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న డిఎంఆర్ శేఖర్

వీరవల్లిపాలెంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డిఎంఆర్ శేఖర్, అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకోలను తాతాజీ, గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, లింగోలు పండు, నల్లా వెంకటేశ్వరరావు పెదమల్లు మణికంఠ తదితరులు. క్రీడాకారులను ఉద్దేశించి డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో పోరాట ప్రతిమతో ముందుకు సాగాలన్నారు. క్రీడాకారులందరికి శేఖర్ వాలీబాల్ జెర్సీ అందజేశారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున యువత జనసైనికులు పాల్గొన్నారు.