ప్రజాసమస్యలపై జనసేన సమరభేరి

  • జనంలోకి జనసేన.. జనం కోసం జనసేన.. ప్రజాసమస్యలపై సమరభేరి
  • గుంటూరు నగరంలో పాత గుంటూరు 4వవార్డులో నేరెళ్ళ సురేష్ ఆధ్వర్యంలో పర్యటన
  • సమస్యల సుడిగుండంలో గుంటూరు నగర ప్రజానీకం
  • సమస్యలపై జనసేన సమరభేరికి విశేష స్పందన
  • వైసీపీ పాలనపై క్షేత్రస్థాయిలో నెలకొన్న ఊహించని ప్రజావ్యతిరేకత
  • జనసేన నాయకుల ముందు సమస్యలను ఏకరువు పెట్టిన స్థానిక ప్రజలు
  • సమస్యల పరిష్కారనికై కృషి చేస్తామని జనసేన నేతల హామీ
  • రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజల్ని కోరిన గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్,

గుంటూరు: నగరంలో 4వ డివిజన్ అధ్యక్షులు శాంతికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జనంలోకి జనసేన జనం కోసం జనసేన సమస్యలపై సమరభేరి కార్యక్రమంలో గురువారం సాయంత్రం స్థానిక పాత గుంటూరు నందు బస్టాండ్ పక్క రోడ్డు నుంచి స్థానిక ప్రజల్ని కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ నేరేళ్ళ సురేష్ ముందుకు సాగారు.. వైసీపీ నాలుగేళ్ళ పాలనలో ప్రజల జీవన విధానం చిన్నాభిన్నం అయ్యిందని నగర ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని నరకయాతన పడుతున్నారని దోపిడీలు దౌర్జన్యాలు హత్య లు కిడ్నాప్లు పెరిగినవి అనిజనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.. వైసిపి నేతలు చేస్తున్న అరాచకాలతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు అని మరలా వైసిపి ప్రభుత్వం వస్తే రాష్ట్రం వదిలి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది అని నేరేళ్ళ సురేష్ అన్నారు.. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి, టిడిపికి మద్దతుగా ప్రజలు అండగా ఉండాలని స్థానిక ప్రజలను నేరేళ్ళ సురేష్ కోరారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు, మరియు 4డివిజన్ అధ్యక్షుడు శాంతి కుమార్, పలు డివిజన్ అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు, స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.