యువత క్రీడల్లో రాణించాలి: జనసేన ఎంపీపీ సత్యవాణి రాము

రాజోలు బాలురు ఉన్నత పాఠశాలలో జరిగినటువంటి సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండల ఎంపీపీ శ్రీమతి సత్యవాణి రాము యువ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె అన్నారు. క్రీడలకు పురుషులు, మహిళలు అనే భేదం లేకుండా అందరూ పాల్గొనాలని ఆమె సూచించారు. అలాగే గ్రామ స్థాయి నుండి మండల స్థాయిలో క్రీడాకారులు పోటీ పడటం వలన మెళకువలు నేర్చుకుని తద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనుభవాన్ని సంపాదించుకోవడానికి మంచి అవకాశం లభిస్తుందని… కావున గ్రామంలో ఉండే యువ క్రీడాకారులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా యువ ఆటగాళ్ళకు సూచించారు. ఇలాంటి కార్య్రమానికి ముఖ్య అతిథిగా భాగస్వామిని చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి ఆమె ప్రత్యక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్దిని విద్యార్దులు మరియు పలువురు స్థానికులు పాల్గొన్నారు.