ప్రపంచంలోనే చాలా పెద్ద స్కాం చేసిన ఘనత వైసీపీదే

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 12, 13, 14 తేదీలలో జగనన్న ఇళ్ళు – పేదలందరికి కన్నీళ్లు అనే నినాదంతో రాష్ట్రావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో టిడ్కో గృహాలు, మరియు ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులు యొక్క ఇబ్బందులు తెలుసుకుని, వారికీ స్థలాలు ఇచ్చిన ప్రాంతానికి #jaganannaMosam అనే దాన్ని హాష్ టేగ్ చేయాలని జనసైనికులకు తెలిపారు. ఈ సందర్బంగా కాకినాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ. మీడియాతో మాట్లాడుతూ ఈ హోసింగ్ స్కీమ్ లో ప్రపంచం లోనే చాలా పెద్ద స్కాం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి చెందుతుంది అని, పవన్ కళ్యాణ్ ఈ హౌసింగ్ కోసం డీటెయిల్స్ తీసుకుని అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని పిలుపు ఇచ్చిన వెంటనే సమాచారం తెలుసుకొనియకుండా సర్వర్లు అపుచేయడాన్ని తప్పుపట్టారు సెంటు భూమిలో దూడలను ఎక్కడ కట్టుకోవాలి? తాడేపల్లి పాలేస్ లోన అని ఏద్దేవా చేసారు. ఎకరానికి సుమారు 2 లక్షల రూపాయలు దోచేసారని, రైతులకు, సరైన ధర ఇవ్వకుండా వైసీపీ నాయకులు కాజేసారని తెలిపారు. పట్టాలు ఇచ్చిన స్థలం చూపించలేదని, ఉచిత ఇసుక అనేదే లేదని, పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు న్యాయం జరగలేదని వీటిపై పూర్తి సమాచారం తెప్పించికుని పేదలకు న్యాయం జరిగేవరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది తెలిపారు.