గిరిజనుల చదువుకు వైసిపి పుల్ స్టాప్ పెడుతుంది: కళ్యాణ్

పాడేరు నియోజకవర్గం: గిరిజనుల చదువుకి వైసిపి ప్రభుత్వం పుల్ స్టాప్ పెడుతుందని జనసేన పార్టీ కళ్యాణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగి పుట్టు మండలం, తర్లగూడ గ్రామంలో గిరిజన ప్రాంతంలో పాఠశాలలు మరమ్మత్తులు లేక చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేశామని ఎన్నో కొత్త పాఠశాలలు కట్టించామని పేరుకే చెప్తున్నారు. కానీ ఆదివాసి ప్రాంతంలో ఇప్పటికీ వైసిపి ప్రభుత్వం వచ్చి సాధించింది ఏమీ లేదు. అలాగే నాలుగు సంవత్సరాలు దాటి మరొక్క ఆరు నెలలలో ఎలక్షన్ వస్తున్నది కానీ ఇప్పటివరకు గిరిజన ప్రాంతంలో ఒక్క రోడ్డు సదుపాయం గాని పాఠశాల మరమత్తుగాని, మంచినీటి సమస్యలు గానీ ఈ ప్రభుత్వం తీర్చలేదు. ఇప్పటికైనా గిరిజనులు ఏకమై ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే సమయం వచ్చిందని పెదబయలు మండల జనసేన యువ నాయకుడు జాగరపు కళ్యాణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.