నెల్లిమర్లలో ఊపందుకున్న యువశక్తి ప్రచారం

నెల్లిమర్ల నియోజవర్గం భోగాపురం మండలం కొల్లి పేట సమావేశంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈనెల 12 న నిర్వహించ తలపెట్టిన యువశక్తి సభను విజయవంతం చెయ్యాలి అని జనసేన పార్టీ నాయకులు, క్రియాశీలక సభ్యులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ యువశక్తి మహాసభ ప్రచార కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ దిశా నిర్దేశం చేసారు. నెల్లిమర్ల నియోజకవర్గ సీనియర్ నాయకురాలు లోకం మాధవి మరియు ఈ మహాసభ నెల్లిమర్ల కో ఇంచార్జెస్ ఉత్తరాంధ్ర మహిళ రిజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మిరాజ్, నెల్లిమర్ల మండలఅధ్యక్షులు అచ్చం నాయుడు పాల్గొని కార్యకర్తలకు మహా సభ గురించి మాట్లాడారు. ఈ సమావేశం సందర్భంలో కొల్లి పేట గ్రామస్తులు యాతకులస్తులు సుమారు మహిళలు యువకులు పెద్దలు గ్రామస్తులు ఏక మొత్తంలో సుమారు 300 మంది లోకం మాధవి ఆధ్వర్యంలో పితాని బాలకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగినది వారందరికీ పితాని బాలకృష్ణ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు జాయిన్ అయిన సందర్భంగా వారి ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ వారందరికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు వందనాలు రమణ మరియు భోగాపురం సీనియర్ నాయకుడు పల్ల రాంబాబు, పిడుగు జోగారావు, పలాంట్ల జగదీష్, సీరిగుడు వెంకటేష్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు నాయకులు పాల్గొన్నారు.