పెడన నియోజకవర్గంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

పెడన నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువతీ యువకులు హాజరుకావాలని విజ్ఞప్తి. ఈనెల జనవరి 12వ తేదీన ఉత్తరాంధ్ర వేదికగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమం ద్వారా యువతి యువకులు తమ గొంతు ద్వారా ఉత్తరాంధ్ర సమస్యలను తెలియజేయలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద చెప్పినట్లు “యువత మేలుకో, లే లేమ్ము, అలసత్వం వద్దు గమ్యం చేరే దాకా నీ పరుగును ప్రయత్నాన్ని ఆపకు”, ఆనాడు స్వామి వివేకానంద యువతను మేల్కొల్పి స్వాతంత్ర్య పోరాటానికి సమానత్వం చేశారు. నేడు పవన్ కళ్యాణ్ యువశక్తి ద్వారా యువతను జాగృతి చేస్తూ దోపిడీ, దౌర్జన్యాలతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్న వేళ సమాజ శ్రేయస్సు కై యువత నడుము కట్టి అవినీతితో కరుడుగట్టిన అరాచక శక్తులను అంతమొందించి, నీతి నిజాయితీతో కూడిన సుపరిపాలన అందించే నాయకుడికి మద్దతుగా నిలుద్దాం. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు బత్తిన హరి రామ్, ఎస్ వి బాబు, శ్రీరం సంతోష్, కనపర్తి వెంకన్న, గరికపాటి ప్రసాద్, గల్లా హరీష్, సమ్మెట గణపతి, సమ్మెట చిన్ని, ముదినేని రామకృష్ణ, చీర్ల నవీన్ కృష్ణ, పాశం నాగమల్లేశ్వరరావు, భూమిరెడ్డి భగవాన్, దాసరి నాని, మారిబోయిన సుబ్బు, మారుబోయిన ఆదిత్య, గుడివాడ రాజా, వెంకటేశ్వరరావు, ఘంటా రవి కుమార్, కొల్లా శ్రీనివాస్, శాంతి గణేష్, తేజ, ధాతు బొర్రా అంకల్, గాదె నరేష్, ఉడుముల ప్రతాప్, మున్నా మరియు కంచ కోడూరు గ్రామస్తులు, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.