జనసేనానికి జెడ్ కేటగిరి భద్రతా సిబ్బందిని కేటయించాలి

ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు, గత కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్ పై హత్యాయత్నానికి కుట్ర పన్నుతున్నట్టు వస్తున్న వార్తలపై వెంటనే పూర్తిగా దర్యాప్తు చేసి, జెడ్ కేటగిరి భద్రతా సిబ్బందిని పవన్ కళ్యాణ్ కి తక్షణమే కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా సోంపేట పట్టణంలో ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు మరియు జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బైపల్లి ఈశ్వరరావు అధ్యక్షతన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే 250 కోట్లతో సుపారీ వస్తున్న కథనాలపై ఎక్కడ ఎవరి చేతులు మారాయో అని పూర్తిగా దర్యాప్తు చేసి వెంటనే వాళ్ళు ఎంతటి వాళ్ళు అయినా తక్షణమే వాళ్ళని శిక్షించవలసిందిగా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సోంపేట పట్టణ పోలీసు స్టేషన్లో శుక్రవారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి ముందుగా అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ సెక్రెటరీ నాగుల హరి బెహరా, కంచిలి జడ్పీటీసీ అభ్యర్థి ఈశ్వర రావు, మణి సంతోష్, మణికంఠ, రవి, రవికుమార్, ఉమాపతి ప్రదీప్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు.