పెనుగొండ సమస్యలపై జనసేనానికి వినతిపత్రం

తిరుపతి, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వేసవి రాజధాని అయినటువంటి పెనుకొండ ఆంధ్రప్రదేశ్ లోనే ఎంతో చరిత్ర కలిగిన పెనుకొండ అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకపడి ఉంది అని జనవాణి కార్యక్రమంలో పెనుకొండ యువనాయకుడు హరి నాయక్ ద్వారా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పెనుగొండ సమస్యలు జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లడానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, నియోజకవర్గ నాయకు కుమార్ మరియు మండల కన్వీనర్ మహేష్ లకు పెనుకొండ మండల ప్రజల తరఫున మరియు పెనుకొండ జనసైనికుల తరఫున నా తరఫున అందరికీ పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.