మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బత్తుల

రాజానగరం, తనకున్న ఆస్తిలో ఎప్పుడూ పెద్ద మొత్తంలో సేవా కార్యక్రమాలకి, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థికపరమైన సహకారం అందించడంలో ముందుండి. “మానవ సేవయే మాధవసేవ” అనే నినాదాన్ని బలంగా విశ్వసించే. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, మాస్ లీడర్ బత్తుల బలరామకృష్ణ నియోజవర్గంలో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదే రాజానగరం నియోజకవర్గంలో ఉన్న సుమారు 80 గ్రామాలకు గ్రామానికి నాలుగు(4) చొప్పున సిమెంట్ సోఫాలు (సిమెంట్ బల్లలు) ఏర్పాటు చేయబోతున్నారు. గ్రామాల్లో పదిమంది కూర్చునే కూడలిలో ఈ సిమెంట్ బెంచీలను పెట్టేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ప్రతి గ్రామానికి నాలుగు సిమెంట్ సోఫాలు(బెంచీలు) అందజేయనున్నారు. నియోజవర్గంలో అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను కలుపుకుంటూ జనసేన పార్టీని బలమైన రాజకీయ శక్తిగా తయారు చేస్తూ, 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ మరోపక్క ఇలా పలు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్న బత్తుల బలరామకృష్ణ పనితీరు పట్ల జనశ్రేణులు మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తూ, నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండే సరైన నాయకత్వం దొరికినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.