బైడెన్​, జిన్​పింగ్ భేటీ- కీలక అంశాలపై చర్చ!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు జీ జిన్​పింగ్ మధ్య సోమవారం కీలక భేటీ జరిగింది. వర్చువల్​గా సమావేశమైన ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు.

ఇరు దేశాల మన మధ్య నెలకొన్న పోటీనీ ఘర్షణపూరితంగా మారకుండా చూసే బాధ్యత తమపై ఉందని ఈ భేటీ ప్రారంభంలో జిన్​పింగ్​తో బైడెన్ అన్నారు.

తన పాత మిత్రుడ్ని కలవడం సంతోషంగా ఉందని జిన్​పింగ్​ బైడెన్​తో పేర్కొన్నారు. అమెరికా-చైనా సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా తాను బైడెన్​తో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.

ఇదే తొలిసారి.. గతంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షునిగా ఉన్న సమయంలో చైనా ఉపాధ్యక్షునిగా ఉన్న జిన్​పింగ్​ను బీజింగ్​లో కలిశారు. ఇద్దరు కలిసి నూడిల్స్ కూడా తిన్నారు. సరదా సంభాషణ జరిపారు. ఫిబ్రవరి, సెప్టెంబర్​లో ఇరువురూ ఫోన్​లో సుదీర్ఘంగా సంభాషించారు. అయితే అధ్యక్ష హోదాలో వారివురూ అధికారికంగా సమావేశమవడం ఇదే తొలిసారి.