భారత ప్రయాణికులకు బ్రిటన్ గుడ్ న్యూస్
భారత్ నుండి వచ్చే ప్రయాణికులకు బ్రిటన్ ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇప్పటి వరకు తప్పనిసరిగా ఉన్న 72గంటల్లోపు ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్ట్ ఇకపై అవసరం లేదని పేర్కొంది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని బ్రిటన్ విదేశాంగ ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టుతో పాటు కచ్చితంగా క్వారెంటైన్ అవ్వాల్సిందేనన్న నిబంధనను కూడా సడలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో కరోనా పరిస్థితులు, కొత్త కేసులు, రికవరీలు, వ్యాక్సినేషన్ అన్ని అంశాలను పరిశీలించాక ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఫుల్ వ్యాక్సినేటెడ్ వారికే ఆ అవకాశం ఉంటుందా… అందరికా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.