జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరంలో సిద్ధం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, జనసేన నాయకులు అజయ్ వర్మ ఠాగూర్ లు కలిసి శుక్రవారం చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ (సీ ఈ ఓ) ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేయడం జరిగింది.