గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు: గునుకుల కిషోర్

నెల్లూరు: మన కోసం ఒకరికి అక్కడ శిలువ వేశారు. మన తప్పులను ఒకరు స్వీకరించారు. ఆ ప్రభువు రుణం ఎప్పటికీ తీర్చలేనిది. ఏసుప్రభువును అప్పటి పాలకులు కొరడాలతో కొట్టారు. ఆయన తలపై ముళ్ల కిరీటాన్ని ఉంచారు. ఆయనతో బలవంతంగా శిలువను లాగించారు. అత్యంత దారుణంగా హింసించారు. చివరకు శిలువకు వేలాడదీశారు. ఇలా సామాన్య ప్రజల కోసం పోరాడి, వారికి అండగా నిలిచి, వారి కష్టాలను తన కష్టాలుగా స్వీకరించిన ఆయన అన్నీ త్యాగాలే చేశారు. వాటిని స్మరించుకుంటూ.. ఏసుప్రభువును కీర్తిస్తూ.. నెల్లూరు సిటీ కపాటి పాళెం దైవజనులు మరియు భక్తులతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ శిలువ మోసి.. సొంత సంపాదన నుండి ఎంతో మందికి సేవ చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని, ప్రజా ప్రభుత్వంలో మరింత సేవ చేసే అవకాశం కల్పించాల్సిందిగా ప్రార్థిస్తూ.. జనసేన పార్టీ తరఫున
అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.