ఇషాంత్ వందో టెస్ట్‌.. జ్ఞాపిక అందజేసిన రాష్ట్రపతి

అహ్మదాబాద్‌: ఇండియా తరఫున వందో టెస్ట్ ఆడుతున్న పేస్‌బౌలర్ ఇషాంత్ శర్మకు జ్ఞాపికను అందజేశారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌. ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఇండియా, ఇంగ్లండ్‌ ప్లేయర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగానే కోవింద్‌.. ఇషాంత్‌ను జ్ఞాపికతో సత్కరించారు. పక్కనే ఉన్న హోంమంత్రి అమిత్ షా.. ఇషాంత్‌కు ప్రత్యేకమైన క్యాప్ అందించారు. ఆ తర్వాత రెండు జట్ల కెప్టెన్లు కోహ్లి, రూట్.. టీమ్ ప్లేయర్స్‌ను రాష్ట్రపతికి పరిచయం చేశారు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో వందో టెస్ట్ ఆడుతున్న ఇషాంత్‌కే తొలి బంతి వేసే అవకాశం రావడం విశేషం.