Markapuram: ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని జనసేన డిమాండ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ 2వ వార్డ్ ప్రజలు తరుపున NH565 రోడ్ లో ఉన్న వీధి దీపాలు ఎస్టేట్ నుండి రాయవరం రైల్వే ఫ్లై ఓవర్ వరకు ఉన్న NH565 రోడ్డుకి మధ్యలో ఉన్న లైట్స్ గత సంవత్సరన్నర నుండి వెలగడం లేదు. 08/11/2021 న 8 గంటల సమయంలో ఎస్టేట్ భారత్ పెట్రోల్ బంక్ నందు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ బంక్ వద్ద చీకటి ఉండడం వల్ల టిప్పర్ లారీని డీ కొట్టిన ద్విచక్ర వాహనము. అలాగే ST.ANNS స్కూల్ దగ్గర ఏక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా కావడం వల్ల రాత్రిపూట రోడ్ సైడ్ లో భారీ కంటైనర్లు, టిప్పర్ లారీలు, పెద్ద పెద్ద వాహనాలు ఆపుతున్నారు. అలాగే NH రోడ్ దాటుటకు ఎటువంటి జెబ్ర క్రాసింగ్ గుర్తులు లేవు, మరియు వాహనాలు నిదానంగా రావటానికి యెల్లౌ చొలౌర్ లైట్స్ కూడా లేవు. NH కి సంబంధించి ఎటువంటి సిగ్నల్స్ లేవు. ఎస్టేట్, సుందరయ్య కాలనీ మరియు రాయవరం ప్రజలు ఈలాంటి ప్రమాదాలు అరికట్టి, త్వరగా ఈ సమస్యని పరిష్కరించాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, సంయుక్త కార్యదర్శులు యన్. వి. సురేష్ బాబు, చిన్న పాల్, జనసైనికులు వెంకటరావు, వీరిశెట్టి శ్రీనివాసులు, హరీష్ పాల్గొన్నారు.