పిఠాపురం టౌన్ కమిటీ సమావేశం

పిఠాపురం పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో టౌన్ కమిటీ అధ్యక్షులు బుర్రా సూర్య ప్రకాష్ రావు, మహిళ అధ్యక్షురాలు శ్రీమతి కోలా దుర్గ ఆధ్వర్యంలో పిఠాపురం టౌన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇతర పార్టీల నుండి జనసేన పార్టీలోకి ఆశావహులను, సానుభూతి పరులను ఎలా ఆహ్వానించాలి. వార్డు సమస్యలు, పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే దిశగా అన్న అంశాలపై సభ్యులు అందరి అభిప్రాయాలను స్వీకరించి, అందరి ఆమోదంపై పార్టీ బలోపేతానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.