రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

దేశవ్యాప్తంగా జరుగుతున్న 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను పాటించాలని ఆయన అన్నారు. కఠోర పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో దేశం కోసం జవాన్లు ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారని అన్నారు.

ధేశ పురోగతి లో రైతుల పాత్ర కీలకమైందంటూ వ్యాఖ్యానించారు. ప్రజలంతా రైతులకు రుణపడి ఉండాలని, రైతులు, సైనికులు దేశానికి వెన్నుముక అని అన్నారు. గత ఏడాది నుండి కరోనా కారణంగా ప్రపంచమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొందని రాష్ట్ర పతి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు అమూల్యం అని పేర్కొన్నారు. ఎన్నో పరిశోదనలు చేసి త్వరగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించిన శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు.