వారాహి యాత్ర విజయవంతం కావాలని నందలూరు జనసైనికుల ప్రత్యేక పూజలు

  • వారాహి యాత్ర విజయవంతం కావాలని శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాధ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి, వారాహి యాత్ర పోస్టర్లు ఆవిష్కరించిన నందలూరు జనసైనికులు

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా నందలూరు మండలంలో జనసేన నాయకుల సమక్షంలో వారాహి యాత్ర సజావుగా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాగాలని, దేవుడి ఆశీస్సులు ఉండాలి అని శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాధ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి వారాహి యాత్ర పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి కడప జిల్లా జనసేన ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అసమర్ధ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను, భూ కబ్జాలను, ఇసుక మాఫియాను, అవినీతి పాలనను ఎండగడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి యాత్రను జూన్ 14వ తేదీ అన్నవరం నుంచి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో యాత్రను చేపట్టబోతున్నారు. రాష్ట్ర ప్రజల సుభిక్షం కొరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, కొరకు రాష్ట్ర ప్రజలకు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కొరకు ఈ వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తారని, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి జనవాణీ కార్యక్రమం, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికలకు సమయం సమీపిస్తున్న సందర్భంగా దిశా నిర్దేశం చేసే కార్యక్రమం. అలాగే ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఈ చేతగాని ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తూ, ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించి వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రజా ప్రభుత్వం స్థాపన దిశగా ఈ వారాహి యాత్ర ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టంగుటూరు ఈశ్వర్, నందు, మన్నూరు గోపి, కళ్యాణ్, సాయి రుద్ర రాజు, సాయి రాయల్, దస్తగిరి, ఎర్రిపాపల్లి మారుతీ తదితరులు పాల్గొన్నారు.