ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా…!

తేది 11-10-2021 సోమవారం ఉదయం 10 గంటలకు GVMC ఎదురుగ ఉన్న గాంధీ విగ్రహం వద్ద.. వైసీపీ ప్రభుత్వం విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు విశాఖపట్నం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శిలు, నియోజకవర్గాల బాధ్యులు, రాష్ట్ర కార్యదర్శిలు,పార్టీ అనుబంధ సంస్థల చైర్మన్లు, కార్పొరేటర్లు, నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు పార్టీ శ్రేయోభిలాషులు తప్పక హాజరు కావాల్సిందిగా కోరుతున్నామని కోన తాతారావు PAC సభ్యులు మరియు గడసాల అప్పారావు AP రాష్ట్ర కార్యదర్శి తెలియచేసారు.