జనసేన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు కార్యక్రమం

వెంకటగిరి నియోజకవర్గం: కలువాయి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసైనికుల పల్లెబాట కార్యక్రమంలో భాగంగా కలువాయి మండలంలోని కలువాయి గ్రామంలో ఎస్సీ కాలనీ నందు ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా జనసేన అభిమానులు, నాయకులతో కలిసి ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతీ, యువకులకు జనసేన అభిమానులకు ఓటు హక్కు కల్పించి 2024లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే దిశగా ప్రతి ఒక్కరు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని విజయవంతంగా గెలిపించాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరాం, వెంకటపతి, శ్రీరామ్, మనోహర్, సుంకు రామ్ కిషోర్, పులే రామకృష్ణ పాల్గొన్నారు.