ఆగస్టు 22న మంగళగిరిలో జనసేన పార్టీ పీఏసీ సమావేశం
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో… జనసేన పార్టీ చేపట్టిన జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై చేపట్టిన డిజిటల్ ప్రచారంపై సమీక్షిస్తారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, గోదావరి వరదలు కారణంగా నష్టపోయిన రైతాంగం, పరిహారం అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై చర్చిస్తారు. రాబోయే మూడు నెలల కాలంలో పార్టీ పరంగా చేపట్టబోయే కార్యక్రమాలు, అక్టోబర్ 5న ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన విధివిధానాల రూపకల్పనపై సమగ్ర చర్చ ఉంటుంది. ఈ సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితోపాటు పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు.