ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాగబాబు పర్యటన

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు ఆగస్ట్ 1వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురైన జనసేన క్రియాశీలక కార్యకర్తకు ప్రమాద బీమా చెక్ అందజేయనున్నారు. అనంతరం అశ్వరావుపేట నియోజకవర్గంలో స్థానిక నాయకులు, జన సైనికులు ఏర్పాటు చేసే పార్టీ జెండాలను నాగబాబు గారు ఆవిష్కరిస్తారు.