కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపిని ప్రజలు ఎన్నాళ్ళు నమ్ముతారు: గాదె

వేమూరు నియోజకవర్గం: వేమూరు మండల జంపని గ్రామం నుండి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వేమూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఉసా రాజేష్, చావలి గ్రామ సర్పంచ్ విష్ణు మొలకల శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఒకటో వార్డ్ నెంబర్ గా వైసిపి నుండి గెలిచిన బండారు నాగరాజు కుటుంభం, ముస్లిం సోదరులు ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో జనసేన పార్టీలోకి చేరటం జరిగింది.. వీరి అందరిని జిల్లా అధ్యక్షులు గాదె పార్టీ కండువాలు మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు అందరూ అధికార పార్టీ వైసీపీ లో పని చేసిన నాయకులు, కార్యకర్తలు అందరూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు పార్టీలోకి చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు మండల ప్రధాన కార్యదర్శి గుప్తా కాల్వ, మండల కార్యదర్శలు మురళి కృష్ణ, గనాధి తిరుపతి రావు, చదలవాడ గ్రామ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కుచ్చలపాడు గ్రామ అధ్యక్షుడు తిరుమలరావు, వేమూరు మండల ఉపాధ్యక్షుడు దాది సీతారామయ్య, పెరవలి పాలెం గ్రామ అధ్యక్షుడు దాసరి రమేష్, సంయుక్త కార్యదర్శి ఎలీషా, ఆలపాటి రాకేష్, జనసైనికులు పాల్గొనడం జరిగినది.