నాదెండ్ల అరెస్టును ఖండించిన రాచమడుగు సుందర్, చందు

నంద్యాల: జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను విశాఖ పట్టణంలో హోటల్ నుంచీ బయటకు పోనివ్వకుండా పోలీసులు నిర్భందించడాన్ని, అలాగే అరెస్ట్ చేయడాన్ని నంద్యాల జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్టణం ఎంపీ నిర్మిస్తున్న ఒక అపార్ట్మెంట్ కు వాస్తు ప్రకారం రోడ్డు ఉండకూడదని, టైకూన్ జంక్షన్ రోడ్ మూసివేయడం దుర్మార్గమైన చర్య అని, ఈ వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా రోడ్లు వేయలెరని, ఉన్న రోడ్లను మూసివేస్తే ఎలా అనీ, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని తొందరలోనే వైసీపీ పార్టీనీ బంగాళాఖతంలో కలుపుతారని తెలిపారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీలు పోరాటం చెస్తే పోలీసుల ద్వార అడ్డుకోవాలని చూస్తన్నారని, ఇది మంచి పద్ధతి కాదనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట వీధి జనసేన నాయకులు గురు, బాబా ఫక్రుద్దీన్, సంజీవ రాయుడు, శ్రవణ్, చిన్న సుబ్బు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.