వృత్తి రీత్యా దూరంగా ఉన్నా వ్యవస్థ కోసం దగ్గరవుదాం

* సిడ్నీలో జరిగిన ప్రవాస భారతీయుల చర్చావేదికలో శ్రీ నాగబాబు
* ఆస్ట్రేలియాలో స్థిరపడిన జన సైనికులు, వీర మహిళల సమావేశాల్లో బిజీ బిజీ
* ప్రధాన నగరాల్లో నిర్విరామ సమావేశాలు, చర్చా వేదికలు

వృత్తి, వ్యాపారాల రీత్యా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో దూరంగా స్థిర పడ్డప్పటికి తెలుగు జాతి ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవటం కోసం అందరం దగ్గరై పని చేద్దామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఆదివారం సిడ్నీలో నిర్వహించిన ప్రవాస భారతీయుల చర్చావేదికలో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పని చేసే జనసేన పార్టీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో స్థిరపడిన వారు అనేక మంది మద్దతు తెలపడం శుభపరిణామమని అన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తోన్న ప్రతీ జన సైనికుడు, వీర మహిళలకు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అభద్రతా భావం పెరిగి పోతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకతను గురించి వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడమే ప్రధాన ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
* మెల్ బోర్న్ మేథో మథనంలో…
మెల్ బోర్న్ నగరంలో మేధావులు, వ్యాపారస్తులు, స్థానిక రాజకీయ నాయకులు, పలు వ్యాపార, సామాజిక సంస్థల యాజమాన్యాలతో జరిగిన మేథో మథనంలో శ్రీ నాగబాబు గారు ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. భారతదేశ రాజకీయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార రంగంలో సాధ్యాసాధ్యాలు గురించి ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి గురించి చర్చ జరిగింది. వేదికపై ప్రసంగించిన చాలామంది జనసేన బలోపేతం కోసం మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం కోసం అవసరం అయితే స్వదేశానికి వచ్చి పని చేస్తామని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన జన సైనికులు, వీర మహిళలు సమిష్టిగా ఆయా ప్రధాన నగరాల్లో నిర్విరామంగా నిర్వహిస్తోన్న సభలు, సమావేశాలు, చర్చావేదికల్లో శ్రీ నాగబాబు గారు ప్రసంగిస్తూ, జన సైనికులు, వీర మహిళలతో ముఖా ముఖి చర్చిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. జనసేన నాయకులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శ్రీ హైపర్ ఆది గారు శ్రీ నాగబాబు గారితో పాటుగా ఆస్ట్రేలియా పర్యటనలో ఆయా వేదికలపై ప్రసంగిస్తూ ప్రవాస జన సైనికులను, వీర మహిళలను ఉత్తేజ పరుస్తున్నారు.