జనసేనలోకి ఇద్దరు మాజీ శాసనసభ్యులు

* ఈదర హరిబాబు, టి.వి.రామారావు జనసేనలో చేరిక
* కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీలో ఇద్దరు మాజీ శాసన సభ్యులు ఆదివారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరారు. ఒంగోలు మాజీ శాసన సభ్యులు, ప్రకాశం జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ శ్రీ ఈదర హరిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మాజీ శాసనసభ్యులు శ్రీ టి.వి. రామారావులు తమ అనుచరులతో కలసి పార్టీలో చేరారు. శ్రీ రామారావు వైసీపీకి 

రాజీనామా చేసి జనసేనలోకి వచ్చారు. మంగళగరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ ఇరువురికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరితోపాటు భీమిలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలు శ్రీ చందర్రావు, శ్రీ అక్కరమాని దివాకర్ లు కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, భీమిలి ఇంఛార్జ్ శ్రీ పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.