యువశక్తి కార్యక్రమానికి 10 లక్షల విరాళం

శ్రీకాకుళం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వతేది అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలంలో యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో తమ సొంత నియోజకవర్గంలో జనసేన పార్టీ చేపట్టిన యువశక్తి కార్యక్రమం కోసం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ యువశక్తి నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది.