జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ యువశక్తి కార్యక్రమానికి రూపాయలు 1,01,116/- విరాళం

విశాఖపట్టణం, జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై జనసైనికులు అందరూ సంఘటితమై ఒక్క టీమ్ గా వెళ్ళాలి అనే ముఖ్య లక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వ తేది అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలంలో యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ తరపున జనసేన పార్టీ చేపట్టిన యువశక్తి కార్యక్రమ నిర్వహణ కోసం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ వ్యవస్థాపకులు సురేష్ వరికూటి రూపాయలు 1,01,116/- విరాళాన్ని శనివారం అందజేయడం జరిగింది. “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” జనసేన నాయకులతో జూమ్ సమావేశాలు నిర్వహించడం మరియు జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసును మరియు జనసేన అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోనికి బలంగా తీసుకెళ్ళేందుకు రూపొందించి జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా జనసేన సింబల్ గాజు గ్లాసుతో కూడిన 15000 పోస్టర్లను ప్రచురించి కొన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేసి క్షేత్ర స్థాయిలో జనసేనను బలోపేతం చేస్తున్న సంగతి తెలిసిందే.