పల్లె పల్లెకు పవనన్న ప్రజాబాట 102వరోజు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు పంచాయతీ కోత్తగూడెం గ్రామం సోమవారం ఎచ్చెర్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వరావు, పల్లె పల్లెకు అలుపు ఎరుగని ప్రచారం చేస్తూ జనసేన మ్యానిఫెస్టో మరియు సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకువెలుతున్నారు. ప్రజలకు అర్ధమైన రీతుల్లో వివరిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచినట్లు అయితే సంవత్సరానికి 5 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం చేసిన రైతులకు పెన్షన్ సౌకర్యం కొరకు కాలేదు. వృద్దులకు వృద్ధాశ్రమం నిర్మించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రజలు పక్షాన నిలబడిన నాయకుడు కాబట్టి అలాంటి నాయకుడుని గెలుపించుకోలసిన బాధ్యత మనపైన ఉంది. అలాగే ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి గడపకి నిత్యం ప్రజల దగ్గరకి వెల్లడం జరుగుతుంది. మేము ప్రతి గడపకి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని కలిసి ప్రజలకు అర్ధమైన రీతిలో జనసేన మ్యానిఫెస్టో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు పాల్గొనడం జరిగింది. పవనన్న ప్రజాబాటకు ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చామని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో మంగమ్మ, మల్లేష్, సుగుణ తదితరులు పాల్గొన్నారు.