జన చైతన్య శంఖారావ కార్యక్రమం 18వ రోజు

రాజమండ్రి రూరల్, జన చైతన్య శంఖారావ కార్యక్రమం 18వ రోజు భాగంగా ధవళేశ్వరం యర్రకొండ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్న సమస్యల గురించి దుర్గేష్ దగ్గర విన్నవించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ మీద విసుగుచెంది మాట్లాడటం జరిగింది. అందుకు దుర్గేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మీ సమస్యలు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల సమస్యలు పెన్షన్లు మొదలగునవి అన్ని సమస్యలు కూడా తీరుస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్పా చిన్నారావు వార నారాయణ, కుక్కల ప్రసాద్, గంగాధర్, అప్పారావు, మట్టపర్తి నాగరాజు, వెంకటేశ్వర ఆలయం కమిటీ సభ్యులు చొప్పాకుల నాయుడు, జిల్లా కార్యదర్శి బీర ప్రకాష్, జిల్లా కార్యదర్శి అమీనా, మెగా సత్యనారాయణ, సాయి, ఆటో బుజ్జి, సికోటి శివాజీ తదితరులు పాల్గొన్నారు.